Sunday, May 5, 2024

వికారాబాద్ జిల్లాలో విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో నలుగురు మృతి

వికారాబాద్ జిల్లా ధారూర్ మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. మండలంలోని కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటో-లారీ ఢీకొన్ని ఘ‌ట‌న‌లో అక్క‌డిక్క‌డే ముగ్గురు మృతి చెంద‌గా.. ఏడుగురు గాయపడ్డారు. వెంట‌నే స్థానికులు గాయ‌ప‌డిన వారిని ఆసుపత్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌రో వ్య‌క్తి మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. మ‌రి కొంత మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. బాధితులంతా పెద్దేముల్‌ మండలం మదనంతాపూర్‌ వాసులుగా పోలీసులు తెలిపారు. కూలీ పనుల కోసం వికారాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement