Sunday, April 28, 2024

యాపిల్ కంపెనీలో.. రూ.140కోట్లపైనే కాజేసిన ఉద్యోగి.. అరెస్ట్ చేసిన పోలీసులు

కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీలో 2008లో చేరాడు భారత సంతతికి చెందిన ధీరేంద్ర ప్రసాద్. మూడేళ్ల తర్వాత సంస్థలో దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. దొంగ ఇన్వాయిస్ లు తయారు చేయడం, విలువైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను కొట్టేయడం, వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటివి చేశాడు. వచ్చిన సొమ్మును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. 2011 నుంచి 2018 వరకు ఇలా దాదాపు 17 మిలియన్ డాలర్లు (మన రూపాయల్లో 140 కోట్ల పైనే) కంపెనీ నుంచి కాజేశాడు. ధీరేంద్ర ప్రసాద్ 2018 లో ఉద్యోగానికి రాజీనామా చేసి యాపిల్ సంస్థ నుంచి బయటకొచ్చాడు. నాలుగేళ్ల తర్వాత తను చేసిన మోసానికి పశ్చాత్తాపంతో ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ మోసంలో తనతో పాటు మరో ఇద్దరు ఉన్నారని పోలీసులకు వెల్లడించాడు. దీంతో ధీరేంద్రతో పాటు యాపిల్ కంపెనీలో ఉద్యోగం చేసిన రాబర్ట్ గేరీ హన్సన్, డాన్ ఎమ్ బేకర్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రసాద్ కేసు విచారణ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement