Friday, April 26, 2024

సుగుణాలరాశి సూర్యపుత్రి తపతి

లోకాలన్నింటికీ వెలుగునిచ్చే సూర్యభగవానుడు విశ్వకర్మ కు మార్తె సంజ్ఞను పెళ్ళి చేసుకున్నాడు. వారికి కాళింది, యము డు అని ఇద్దరు పిల్లలు కలిగారు. రాను రాను సూర్యుడితో కలిసి బతక టం సంజ్ఞకు కష్టమైంది. ఆయన తేజస్సును ఆమె భరించలేకపోయింది. భర్తకు సేవలు చేసే బాధ్యతను తన పరిచారిక ఛాయకు అప్పగించి ఆమె తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్ళింది. సంజ్ఞ రూపంలో ఛాయ సూర్యుడికి చాలాకాలం సేవలు చేసింది. ఆమెకు సూర్యుడి వల్ల శనీశ్వ రుడు, తపతి కలిగారు. సూర్యుని కూతురు, సావిత్రికి చెల్లెలు అయిన తపతి మహా సౌందర్యవతి, సుగుణాల ప్రోగు. ఆమెకు యుక్త వయస్సు వచ్చేసరికి మరింత అందంగా తయారైంది. సూర్యుడు కుమార్తెకు పెళ్ళిచేయాలని నిశ్చయించుకున్నాడు. తగిన మంచి వరుడి కోసం అన్వేషిస్తున్నాడు.
ఒకరోజు సంవరణుడు తపతిని చూసాడు. ఆ సంవరణుడు చంద్ర వంశ రాజు ఋక్షుని కుమారుడు. పర్వత ప్రాంతాలలో పగలంతా వేటకై తిరిగి తిరిగి అలసిపోయి సంవరణుడు ఒక సరస్సును చేరుకు న్నాడు. అక్కడ దేవకన్యలు ఆటపాటల్లో మునిగి వున్నారు. వారంద రిలో తపతి మొగలిరేకుల మధ్య మెరుపుతీగలా వుంది. సంవరణునికి తపతి పట్ల అనురాగం అధిగమయింది. ఆమె దగ్గరకు వెళ్ళి ”సుందరీ! నిన్ను చూసిన క్షణంలోనే నేను నీకు దాసుడినయ్యాను. నన్ను కనికరిం చు” అని బతిమాలాడు. అతను అలా అంటూవుండగానే తపతి మాయ మైంది. ఆమె కూడా మన్మథాకారుడైన సంవరుణుని మోహంచింది. అతన్ని చూసిన క్షణం నుంచి తపతి కూడా సంవరణుని మోహంచింది. ఒకరోజు తపతి సంవరుణుడికి కనిపించింది. సంవరణుడు తపతిని గాంధర్వ వివా#హం చేసుకుంటానన్నాడు. అందుకు ఆమె ”నేను సూర్యుని కుమార్తెను, సావిత్రికి చెల్లిని, నాకు స్వాతంత్య్రం లేదు. నీకు నాపై ప్రేమ ఉంటే నా తండ్రిని అడుగు. మన పెళ్లి జరు గుతుంద”ని చెప్పి వెళ్లిపోయింది.
రాజధాని ప్రతిష్ఠానగరానికి వెళ్ళిన సంవరణునికి నిద్రాహారాలు లేవు. ప్రజల మంచిచెడ్డలు పట్టించుకోవడం పూర్తిగా మానేసాడు. తపతి తప్ప మరో ధ్యాస లేదు. ఈ విషయం ఋక్షుని కులగురువైన వశి ష్ట మహామునికి తెలిసింది. సూర్యపుత్రి తపతి కోసం అతను తపిసు ్న్డని మహాముని గ్రహంచాడు.
”నీ మనోరథం నెరవేరుస్తాను. దిగులు మానుకో” అని సంవరణు డికి చెప్పి వశిష్టుడు యోగబలంతో ఆదిత్య మండలానికి వెళ్ళి వేద మంత్రాలతో సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. భాస్కరుడు మహర్షిని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం యిచ్చి ”మునివర్యా! మీ రాకకు కారణం ఏమిటి?” అని అడిగాడు.
”ఋక్షుడి కుమారుడు సంవరణుడు నీ కుమార్తె తపతిని చేపట్టా లనుకుంటున్నాడు. అతడు నిర్మల యశస్యుడు. ప్రజారంజకంగా పాలన చేస్తున్నవాడు. పెద్దలు, గురువుల ఎడ విశేష గౌరవం కలిగిన వాడు. వేదాలను శ్రద్ధగా నేర్చుకున్నాడు. అన్నిటికీ మించి నాకు ప్రియా తి ప్రియమైన శిష్యుడు. అతనికి నీ కుమార్తెను ఇమ్మని అడగడానికి వచ్చాను” అన్నాడు వశిష్ఠ మహర్షి. సూర్యుడు సంతోషంతో సమ్మతిం చి తన కుమార్తె తపతిని వశిష్టుడి వెంట సంవరణుడి దగ్గరకు పంపా డు. ప్రతిష్ఠానపురంలో వారిద్దరి వివాహం వశిష్టుడి ఆధ్వర్యంలో అతి వైభవంగా జరిగింది. సంవరణుడు తపతిని పెళ్ళి చేసుకున్నాక రాజ్య పాలనంతా మంత్రులకు అప్పగించి నదీపర్వత ప్రాంతాలలో భార్యతో ఇష్టభోగాలు అనుభవిస్తున్నాడు. అలా పన్నెండేళ్ళు గడిచాయి. రాజు యజ్ఞయాగాది ప్రజాహత క్రతువులు చెయ్యకుండా విషయ లోలుడై వున్నందున అతని రాజ్యంలో అనావృష్టి ప్రబలింది. తిండి, బట్ట కరువై ప్రజలు దేశాంతరం వెళ్ళవలసిన దుస్థితి కలిగింది.
అప్పుడు వశిష్టుడు సంవరణుని సతీసమేతంగా నగరానికి తీసుకు వచ్చి పుణ్యస్నానాలు చేయించి శాంతి క్రతువులు నిర్వహంప చేశాడు. ఇంద్రుడు సంతోషించి వర్షం కురిపించాడు. దేశం మళ్ళీ సుభిక్షమైంది. సంవరణుడు అప్పటినుంచి యజ్ఞయాగాది కర్మలు చేస్తూ చాలాకాలం చక్కగా పరిపాలన చేసాడు. ఆ దంపతులకు కురువంశానికి మూలపురు షుడైన ‘కురువు’ జన్మించాడు. భూమ్యాకాశాలకు తన ప్రచండ కిరణా లతో తాపం కలుగచేసే సూర్యభగవానుడి కుమార్తె కావడం వలన కురు వు తల్లికి తపతి అని పేరు వచ్చింది. తపతి వంశోద్ధారకులు కాబట్టి కురు సంతానాన్ని ‘తాపత్యులు’ అని కుడా అంటారు. వింధ్య పర్వతాలకు పశ్చిమంగా ప్రవహంచి ప్రజల పాపాలు పోగొట్ట మని భాస్కరుడు తన కుమార్తెను దీవించాడట. తండ్రి ఆశీస్సును అనుసరించి తపతీదేవి నదీమతల్లిగా మారి నర్మదానదిలో లీనమై ప్రవహస్తోంది.
గంగానదీ తీరాన అర్జునుడితో చెలిమి చేసిన చిత్రరథుడు అనే గంధర్వుడు పార్థుణ్ణి ‘తాపత్యా’ అని సంబోధిస్తాడు. కిరీటి కోరిక మేర కు తన పిలుపు వెనుకగల ఈ తపతి వృత్తాంతాన్ని వివరిస్తాడు. చిత్రర థుడి అసలు పేరు అంగార పర్ణుడు. అడవులలో రేయింబవళ్ళు ప్రయా ణం చేస్తూ ఒక అర్థరాత్రి వేళ గంగానదిని సమీపించిన పాండవుల అడు గుల చప్పుడు విని సఖులతో క్రీడిస్తున్న అంగార పర్ణుడు కోపోద్రి క్తుడై కయ్యానికి కాలుదువ్వాడు. అర్జునుడు అతన్ని విరథుడ్ని చేసి నేల మీద కు లాగి దండించాడు. అంగారపర్ణుడు కుప్పకూలాడు. అతని భార్య కుంభీనసి వచ్చి పతిభిక్ష పెట్టమని ధర్మరాజుకు ప్రణమిల్లింది. అన్న చెప్పిన మీదట విజయుడు గంధర్వుని విడిచి పెట్టాడు. కృతజ్ఞతా సూచ కంగా అంగారపర్ణుడు ‘చాక్షుసి’ అనే గంధర్వ విద్యను సవ్యసాచికి బోధించాడు.
అర్జునుడి ఆగ్నేయాస్త్ర ప్రభావంతో దగ్ధమైన తన రథానికి మారు గా ‘చిత్రరథం’ అనే మరో రథాన్ని సృష్టించుకున్నాడు గనుక ఆనాటి నుంచి అంగారపర్ణుడు చిత్రరథుడయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement