Saturday, April 20, 2024

రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

రేపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. రేపు ఉదయం 9గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పాల్గొననున్నారు. గుజరాత్ ఎన్నికల్లో భారీ విజయంతో మోడీని బీజేపీ ఎంపీలు సన్మానించనున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం, సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం, కేంద్ర పథకాలను ప్రజలకు చేరువ చేయడంపై ఎంపీలకు మోడీ దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement