Wednesday, May 22, 2024

టీటీడీకి రూ.9 కోట్ల 20 లక్షలు విరాళం

తిరుమల, ప్రభన్యూస్‌ : టీటీడీకి రూ.9 కోట్ల 20 లక్షలు విరాళం అందింది. దానికి సంబంధించిన పత్రాలను దాత స్వర్గీయ డాక్టర్‌ ఆర్‌.పర్వతం జ్ఞాపకార్థం ఆమె సోదరి రేవతి విశ్వనాథం శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డికి అందచేశారు. చెన్నై మైలాపూర్‌కు చెందిన స్వర్గీయ డాక్టర్‌ పర్వతం పేరుమీద బ్యాంకులో రూ.3 కోట్లు 20 లక్షలు నగదు డిపాజిట్లు ఉన్నాయి. దీంతో పాటు రూ.6 కోట్లు విలువైన రెండు ఇళ్లు ఉన్నాయి. డాక్టర్‌ పర్వతం కన్ను మూయడంతో ఆమె జ్ఞాపకార్థం ఆమె సోదరి రేవతి విశ్వనాథం ఈ ఆస్తిని శ్రీవేంకటేశ్వరస్వామి వారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పత్రాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపం లో టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డికి అందచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement