Wednesday, May 22, 2024

విప్రుని పుత్రప్రాప్తి!

పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదవేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయ జ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారికి సంతానము లేద ను లోటు తప్ప మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచార పడుచున్న ఆ బ్రాహ్మణుడొకనాడు భార్యతో ”గుణవంతుడైన పుత్రుడొకడు అయిన మనకు కలుగలేదు, అట్టి పుత్రుడొకడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచార పడెను”. అప్పుడామె నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదనుకొందును” అని సమాధానము ఇచ్చెను. అప్పుడా బ్రాహ్మణుడు ”ప్రియా కష్టతర మైన తపము నాచరించి అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టి పరచెదను. పుత్ర వరమును కోరుదునని చెప్పెను. కష్టమైన నియమ ములను పాటించి నిశ్చలమైన తపముచేసి మృకండు మహామునివ లె ఉత్తమ పుత్రవరమును కోరెదననియు పలికెను. ఆ దంపతులిద్ద రు తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరి.
బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీ హరినిని మనసు లో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. కొంత కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును శంఖమును, చక్రమును, గదను ధరించియుం డెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తు భమను మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యులకాంతితోనుండెను. శాంత భూషితమై ప్రసన్నతకల శ్రీహరి ముఖము మకరమండలముల కాంతితో మరింత శోభాయ మానముగ నుండెను. నారద మహర్షి స్తుతించుచుండగా అప్సర కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీసమేతుడై గరుత్మం తుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను. తన మనసులో నిలి చిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనందపరవశుడైన అతడు శ్రీమన్నా రాయణ మూర్తిని

స్తుతించెను ఇలా…
విప్రకృత విష్ణుస్తుతి
నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల
నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ
గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ
కష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే
లోకస్థాయ హదిస్థాయ అక్షరాయాత్మనే నమ:
అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే
యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే
జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే
సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్వ్రాఘనాశినే నమ:
కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ
నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమ:
విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే
సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమ:
హషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే
పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే
ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమ:
జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే
వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమ:
జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే
ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమ:
నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే
గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే
కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామతమూర్తయే
కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ
సంకర్షణాయ శర్వాయ నమస్త్రైలోక్యపాలినే
భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే
నానాభేద విభేదాయ నానారూప ధరాయచ
నమస్తే భగవాన్‌ విష్ణో పాహమాంకరుణాకర
(శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము అందరు చదువుట శ్రేయస్కరము)
ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతిం చి ఆనంద పరవశుడై నమస్కరించుచు నిలిచియుండెను, భగవం తుడు వరమును కోరుకొమ్మనెను శ్రీహరి మాటలను విన్న ఆ విప్రు డు ‘స్వామీ! నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తిని మ్ము , ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్రసం తానమునిచ్చి , నాకు ముక్తినొసగుమని కోరెను. శ్రీహరి నీవు కోరినట్లే వరము నిచ్చితిని , నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదునని పలికి యంత రాథనము నుండెను. బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కి లాభము నందినవానివలె సంతసింసించు తన ఇంటికి చేరెను. కొంతకాల మునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.
కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని వానిని నిమురుచు కన్నీరు కార్చుచు, విచారవదనముతో ఆహారమును తీసికొనక విచారించుచుండెను. ”నాధా నీవు తీవ్ర తపమొనర్చి వరముగా నీ పుత్రుని పొందితిని చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పండ్రెండు సంవత్సరములు జీవించి విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్రశోకము నెట్లు స#హంపగలను?” అని భర్తతో పలికె ను. విప్రుడు భార్య మాటలను విని బాధపడుచు నామెనోదార్చి నిశ్చయించెను. ఆమె నూరడించుచు యిట్లనెను. ”ప్రియా దు:ఖిం పకుము, దు:ఖము శరీరమును బాధించును. నీ దు:ఖమునకు తగి న కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయేట మృతినందునని యిప్పుడు దు:ఖించుచుంటివా? నీకు నాకును యెప్పటికైనను మృ త్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైన మరణింపక తప్పదు కదా! మరి యీ ముందు వెనుకలు వయస్సు లకు కలదు కాని మృత్యువునకు లేదు. కావున శోకింపకుము జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేల? నీవు దు:ఖించినను కానున్నది కాక మానదు. అనగా నీ శోకము నిష్ప్ర యాజనము. ప్రతిప్రాణియు తాను చేసిన కర్మననుసరించి జన్మిం చును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా?” అని యామనూరడించెను నిరర్థకమైన దు:ఖమును విడుపుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ నుండుము అని పలికి మరల గంగాతీరమున చేరి నియ మనిష్టలతో శ్రీ#హరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. శ్రీహరి వానిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయ ణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను.

Advertisement

తాజా వార్తలు

Advertisement