Thursday, May 16, 2024

సుజిత్ కు మరో మెగా హీరో అవకాశం ఇచ్చేసాడు!!

శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు డైరెక్టర్ సుజిత్. ఈ సినిమా తర్వాత ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా లెవెల్ లో సాహో సినిమా చేశాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో తెరక్కింది. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కానీ ఉత్తరాదిన మాత్రం సుజిత్ కు మంచి పేరును తీసుకువచ్చింది.

అయితే ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ బాధ్యతలను అప్పగించారు. కానీ సుజిత్ చేసిన మార్పులు మెగాస్టార్ కు నచ్చకపోవడంతో ఆ అవకాశం అలా నీరుగారిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ తయారు చేశారట సుజిత్. దానికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతోపాటు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చెర్రీ. దాని తర్వాత సుజిత్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement