Thursday, May 2, 2024

సాయి పల్లవి అనుకోని అతిధి…ఓటీటీ లో

కరోనా ప్రారంభమైనప్పటి నుంచి కూడా డిజిటల్ రంగానికి ఆదరణ పెరిగింది. ఓటీటీ లలో వచ్చే సినిమాలకు సినీ అభిమానులు అలవాటుపడ్డారు. అయితే ఇప్పుడు ఓ మలయాళ సూపర్ హిట్ మూవీ తెలుగు లో రీమేక్ కాబోతుంది. హీరోయిన్ సాయి పల్లవి, మలయాళ నాచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం కిరణ్ అథిరన్ సినిమా ఇప్పుడు తెలుగు డౌబ్బింగ్ కాబోతుంది.

ఇది ఆహలో స్ట్రీమింగ్ కాబోతుంది. వివేక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేరళలో 1970 లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇక మే 28న ఈ సైకాలజికల్ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అనుకోని అతిధి టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ,అతుల్ కులకర్ణి, రెంజి పానికర్ ,లియోనా లిషోయ్, శాంతి కృష్ణ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement