Tuesday, May 7, 2024

రూ.25వేల కోట్లతో ఆదానీ గ్రూప్ భారీ ఒప్పందం

కరోనా కాలంలోనూ అదానీ సంస్థ దూకుడు కొనసాగిస్తోంది. తాజాగా ఎస్​బీ ఎనర్జీ ఇండియాలో 100% వాటా కొనుగోలుకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్​(AGEL​) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకుగాను సాఫ్ట్ బ్యాంక్​ గ్రూప్​, భారతీ గ్రూప్‌లతో ఒప్పందం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.25 వేల కోట్లుగా అదానీ సంస్థ తెలిపింది.

గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించి భారత్​లో ఇదే అతిపెద్ద ఒప్పందంగా తెలుస్తోంది. ఎస్​బీ ఎనర్జీలో సాఫ్ట్ బ్యాంక్​కు 80 శాతం, భారతీ గ్రూప్​నకు 20 శాతం వాటా ఉండేది. అయితే ఈ మొత్తాన్ని అదానీ గ్రీన్​ సొంతం చేసుకున్నట్లుగా ఒప్పందంపై సంతకాలు చేశాయని పేర్కొంది. ఎస్​బీ ఎనర్జీ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో పునరుత్పాదక ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటి నుంచి సుమారు 4,954 మెగావాట్ల మేర విద్యుత్​ ఉత్పత్తి జరుగుతోంది. వాటిలో 84 శాతం సోలార్​ ఎనర్జీ (4,180ఎండబ్ల్యూ), విండ్-సోలార్ ఎనర్జీ 9 శాతం(450ఎండబ్ల్యూ), కేవలం విండ్​ నుంచి 7 శాతం (324ఎండబ్ల్యూ)​ల విద్యుత్​ ఉత్పత్తి జరుగుతుంది. మరికొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement