Thursday, May 2, 2024

ప్రభాస్ సినిమాకి డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా !!

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అలాగే మరోవైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండే కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడు.

ఈ మూడింటితో పాటు మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా లో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించబోతోంది. అలాగే బిగ్ బి అమితాబ్ కూడా నటించబోతున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు డైలాగ్స్ ను సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాయబోతున్నారట. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై రోజురోజుకీ ఆసక్తి పెరిగేలా క్యాస్టింగ్ ను కూడా ప్రకటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement