Sunday, April 28, 2024

డియర్ కామ్రేడ్ వల్లే బాలీవుడ్ ఎంట్రీ !!

రష్మీక మందన్న విజయ్ దేవరకొండ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చాయి. అయితే డియర్ కామ్రేడ్ సినిమా వల్ల రష్మిక మందన్న కు బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చిందట. ఈ విషయాన్ని రష్మిక ను మిషన్ మంజు సినిమా తో బాలీవుడ్ కి పరిచయం చేస్తున్న దర్శకుడు శాంతన భాగ్చీ చెప్పారు. ఈ విషయమై మాట్లాడుతూ డియర్ కామ్రేడ్ లో రష్మిక నటనను చూసి ఇంప్రెస్ అయ్యాను అని… నిజానికి మా సినిమా లో అమాయకత్వం అందంగా ఉన్న నటి కావాలని అది తన లో కనిపించింది అని అన్నారు.

జూమ్ లో స్క్రిప్ట్ చెప్పినప్పుడు రష్మిక తన పాత్ర యొక్క ఔచిత్యం ని గుర్తుఎరిగిందని అన్నారు. మిషన్ మంజులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే గుడ్ బై సినిమాకు కూడా ఓకే చెప్పింది రష్మీక. ఈ రెండు ప్రాజెక్టులతో రష్మిక బాలీవుడ్ లో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement