Wednesday, May 22, 2024

Nivetha Pethuraj | మౌనంవీడిన నివేదా.. నిజాలు తెలుసుకోండని మీడియాకు హితవు !

నటి నివేదా పేతురాజ్‌పై ఇటీవల తమిళ మీడియాలో నెగిటివ్ వార్తలు వైరల్‌గా మారాయి. నివేదా పేతురాజ్‌పై డబ్బులు ఖర్చుపెడుతున్నారంటూ కొందరు తమిళ మీడియాలో అభ్యంతరకర వార్తలు రాశారు. దీంతో నివేదా పేతురాజ్ తన సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలపై సీరియస్ గా స్పందించి ఫైర్ అయింది.

‘‘ఇటీవల నాపై డబ్బులు ఖర్చుపెడుతున్నారని తప్పుడు వార్తలు రాశారు. ముందు మౌనంగా ఉన్నాను.. ఈ ఫేక్ న్యూస్ రాసే వారు ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే ముందు.. వారు విన్న సమాచారం నిజమో కాదో తెలుసుకోండి.. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ వార్తతో కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. నేను గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల వయస్సు నుండి సంపాదించడం ప్రారంభించాను. మేము 20 సంవత్సరాలకు పైగా దుబాయ్‌లో ఉన్నాము.

సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు అవకాశం ఇవ్వమని నేను ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోని అడగలేదు. నేను 20కి పైగా సినిమాలు చేశాను, అవన్నీ నాకు వచ్చిన అవకాశాలే. నాకు డబ్బు మీద అత్యాశ లేదు. నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. 2002 నుంచి దుబాయ్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాం.. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాను. జీవితంలో ఎన్నో కష్టనష్టాలకు గురై ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాను. మీ కుటుంబంలోని ఆడవాళ్ల మాదిరిగానే నేను కూడా గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాను.

అలాంటి వార్తలు రాసేవారిలో కొంతైనా మానవత్వం ఉందని, మరోసారి ఇలా పరువు తీయరని భావిస్తూ.. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంలేదు. కుటుంబాల పరువు ప్రతిష్టని నాశనం చేసేముందు ఆ వార్త నిజమో కాదో కనుక్కొని రాయండి. ఇకపై నన్ను బాధలకు గురిచేయకండి. ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు’’ అని పోస్ట్ చేసింది నివేదా.

Advertisement

తాజా వార్తలు

Advertisement