Sunday, April 28, 2024

కియారా రిప్లయ్ తో అభిమాని ఆనందం మాములుగా లేదు

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఈ అమ్మడు సోషల్ మీడియా లో ఏదైనా పోస్ట్ పెట్టిందంటే చాలు వేళల్లో లైక్స్ , కామెంట్స్ వస్తూ ఉంటాయి. కాగా సోషల్ మీడియా లో కియారా అభిమాని పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పది నిమిషాలు కియారాను మీట్ అయితే చాలనుకుంటున్న ఆ అభిమాని.. ఇది తనకు డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని చెప్పాడు. తను సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌ కోసం ఢిల్లీకి ఎన్నిసార్లు వచ్చినా కలవలేకపోయానని ఫీల్ అయ్యాడు. కానీ ఈ సారి మళ్లీ ట్రై చేస్తానని, కచ్చితంగా మీట్ అవుతాననే హోప్ ఉందని ట్వీట్ చేశాడు.

అభిమాని చేసిన ట్వీట్ కి కియారా రిప్లయ్ ఇచ్చింది. అతి త్వరలోనే మీ కల నిజం అవుతుంది అంటూ చెప్పుకోచింది. ఇక కియారా రిప్లయ్ కి అభిమాని ఆనందం అంతా ఇంత కాదు. గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నానని లైఫ్‌లో ప్రతీ విషయం కియారాతో ముడిపడి ఉందని… తన పదాలు ముఖంపై చిరునవ్వును తీసుకొచ్చాయని చెప్పుకొచ్చాడు. తనను కలవడం లైఫ్‌లోనే బెస్ట్ డే అవుతుందని ట్వీట్ చేశాడు అభిమాని.

Advertisement

తాజా వార్తలు

Advertisement