Thursday, May 2, 2024

శ్రీకాంత్ కి క‌రోనా – ట్వీట్ చేసిన హీరో

వ‌రుస‌గా సినీ సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బారిన ప‌డ‌గా, ఇప్పుడు హీరో శ్రీకాంత్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఈ విష‌యాన్ని పోస్ట్ చేశారు. కాగా తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని రోజుల నుంచి లక్షణాలు ఉన్నాయ‌న్నారు. తనతో సన్నిహితం మెలిగిన వారంతా కూడా టెస్టులు చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు మహేష్ బాబుతో పాటు సీనియర్ యాక్టర్లు శోభన, మీనా కూడా కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు త్రిష, కీర్తి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్ లు కరోనా బారినపడి కోలుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement