Saturday, May 4, 2024

మోడీ చ‌క్ర‌వ‌ర్తి అయితే… కేసీఆర్ సామంత రాజు : రేవంత్ రెడ్డి

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చక్రవర్తి అయితే… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సామంత రాజు అంటూ కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈ రెండు ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని రేవంత్‌ రెడ్డి అన్నారు.

తెలంగాణలో విద్యార్థులు ..ఉద్యోగుల ఆకాంక్షలు నేరవేరడం లేదని.. ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమన్నారు. టీఆర్‌ఎస్‌ విధానాల వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. త్వరలో జైల్ భరో చేద్దామని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు పిలుపు నిచ్చారు. మోడీ..కేసీఆర్‌ లాంటి నాయకులు దేశాన్ని పట్టి పీడుస్తున్నారని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల విధానం మీద అనుమానం వచ్చేలా ప్రధాని కార్యాలయం వ్యవహరిస్తుందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తొక్కి చంపిన మంత్రిని మోడీ కేబినెట్‌లో ఇంకా కొనసాగించడం అంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. రైతులను తొక్కి చంపండి అని ప్రొత్సహించడమేనా అనిరేవంత్ రెడ్డి అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement