Friday, May 17, 2024

Pithapuram : రూ.17 కోట్ల విలువైన బంగారం ప‌ట్టివేత

పిఠాపురం : సరైన బిల్లులు లేకుండా, రవాణా చేసే వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా బంగారం, వెండి వస్తువులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్‌ఎస్‌టీ అధికారుల బృందం పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.17కోట్ల విలువైన వస్తువులను సీజ్‌ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.

వివరాల్లోకి వెళితే.. గ‌త‌ రాత్రి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టోల్‌ ప్లాజా వద్ద ఎస్‌ఎస్‌టీ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వస్తున్న సీక్వెల్‌ లాజిస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన వాహనం వారికి కనిపించింది. వెంటనే తనిఖీలు చేపట్టగా.. అందులో బంగారు, వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సరైన ధ్రువపత్రాలు చూపకపోవడం, తరలించే వ్యక్తుల పేర్లూ పత్రాల్లో నమోదు చేయకపోవడంతో వాహనాన్ని సీజ్‌ చేసి పిఠాపురం తహసిల్దార్‌ కార్యాలయానికి తరలించారు. పంచనామా అనంతరం సీజ్‌ చేసిన ఖజానా కార్యాలయానికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement