Thursday, May 23, 2024

Karnataka : కొడుకు చేసిన త‌ప్పుకు….. త‌ల్లికి శిక్ష‌

కొడుకు చేసిన త‌ప్పుకు ఓ త‌ల్లి శిక్ష అనుభ‌వించింది. ఓ యువ‌కుడు ప్రేమ మాయ‌లో ప‌డి త‌ల్లిని అద‌మ‌రిచాడు. తన ప్రేమికురాలితో పారిపాయాడు. దీంతో ఆగ్ర‌హించిన యువ‌తి కుటుంబం త‌ల్లికి శిక్ష విధించాడు. విచ‌క్ష‌ణరహితంగా ఆమెను స్తంభానికి క‌ట్టేసి దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ హేయ‌మైన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌వేరి జిల్లాలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే….. రాణేబెన్నూర్ తాలూకా అరెమల్లాపూర్ గ్రామానికి చెందిన హనుమవ్వ కుమారుడు మంజునాథ్‌, అదే గ్రామానికి చెందిన పూజ అనే యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఇటీవలే గ్రామం విడిచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పూజ కుటుంబీకులు యువకుడి తల్లిపై దాడి చేసి దారుణంగా కొట్టి అవమానపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని బాధిత మహిళను రక్షించారు. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీలోని 324, 354 బీ, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement