Sunday, May 12, 2024

ధూమ్ దామ్ ప్ర‌చారం…

మారుమూల గ్రామం నుంచి నగరానికి వచ్చిన యువ కుడు తను వృత్తిపరంగా నాయిని బ్రహ్మాణుడిగా షాపు నిర్వహిస్తుం టాడు. అనుకోని పరిస్థితుల్లో అత ను ఓ మాఫియా వలలో చిక్కు కుంటాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలేమిటీ? అనేది ‘ధూ మ్‌ దామ్‌ దుమారం’ చిత్రంలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం” అని చిత్ర దర్శకుడు జిఎల్‌బి తెలిపారు.
జిఎల్‌బి సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ధూమ్‌ దామ్‌ దుమారం’. ఇదే నెలలో కొమురవెల్లిలో చిత్రీకరణ ప్రారంభించి, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తామని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రాజు బి. యాదవ్‌ తెలిపారు.
మల్లిక్‌ బాబు హీరో గా, ఇషా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇతర ప్రధా న పాత్రలో రాజు బి యాద వు, లక్ష్మీ రావు హైమావతి, ఎంసుబ్బరాజు, నరసింహ, నవల్‌ కిషోర్‌ అగర్వాల్‌. మహేష్‌ గూడుగుంట్ల, మల్లాది శాస్త్రి, టి వెంకటేష్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, నిర్మాత, దర్శకత్వం: జి ఎల్‌ బి శ్రీనివాస్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement