Tuesday, July 23, 2024

Rifle shooting లో మను, అనీష్‌ అగ్రస్థానం..

ఒలింపిక్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో భాగంగా నిర్వహించిన రైఫిల్‌ షూటింగ్‌లో ఒలింపియన్‌ మను భాకర్‌, అనీష్‌ భన్వాలా అగ్రస్థానంలో నిలిచారు. 25 మీటర్ల రైఫిల్‌ షూటింగ్‌ పోటీలో వరుసగా మూడు మ్యాచ్‌లలో పోటీల్లో అర్హత సాధించారు. పురుషుల విభాగంలో అనీష్‌ 25 మీటర్ల రాఫిడ్‌-ఫైర్‌-పిస్టోల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)లో 587 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

మహిళల విభాగంలో 25 మీటర్ల పిస్టోల్‌ విభాగంలో 585 పాయింట్లతో నిలిచింది. ప్రతి ఈవెంట్‌లో ఐదుగురు షూటర్లలో ఇద్దరూ టాప్‌ ర్యాంక్‌ను కొనసాగించారు. ఐదుగురు క్వాలిఫైడ్‌ షూటర్లు గెలవాల్సిన కీలకమైన పోడియం పాయింట్లు ఉన్నప్పుడే ఫైనల్స్‌ ఆదివారం జరుగనున్నాయి.

మహిళల పిస్టల్‌ విభాగంలో రిథమ్‌ సాంగ్వాన్‌ రెండు సాధారణ ఔటింగ్‌లు చేసిన తర్వాత టాప్‌ స్కోరు 586తో పుంజుకుంది. అయితే సిమ్రాన్‌ప్రీత్‌ కౌర్‌ బ్రార్‌ ఇన్నర్‌-10లలో 585తో మను భాకర్‌ను రెండో స్థానంలో నిలిపింది. ఈషా సింగ్‌ (579) నాలుగో స్థానంలో ఉండగా, అభిధ్న్య అశోక్‌ పాటిల్‌ (575) ఐదో స్థానంలో నిలిచింది.

ఆదివారం జరిగే ఫైనల్స్‌లో మను తన సమీప ప్రత్యర్థిపై కనీసం నాలుగు పాయింట్ల సాధిస్తే నాల్గవ ట్రయల్‌లోకి వెళ్తుంది. ప్రస్తుతం ఈషా, రిథమ్‌, సిమ్రాన్‌ప్రీత్‌ మధ్య రెండో స్థానం కోసం పోరు చాలా గట్టిగా ఉంది. అటు పురుషుల ఆర్‌ఎఫ్‌పీలో అనీష్‌ భన్వాలా తన సమీప ప్రత్యర్థిపై 2 పాయింట్ల సాధించాల్సి ఉంది. విజయ్‌వీర్‌ సిద్ధూ, భవేష్‌ షెకావత్‌లు రెండో స్థానం కోసం గట్టిపోటీ నెలకొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement