Tuesday, May 14, 2024

‘చావుకబురు చల్లగా’.. ‘ఆహా’ అనిపిస్తుందా?

కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన మూవీ ‘చావుకబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 23వ తేదీ నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమా నిడివి ఎక్కువవుతుందనే ఉద్దేశంతో కొన్ని సీన్స్ ను ఎడిట్ చేయడం వలన లాజిక్ మిస్ అయిందనే విమర్శలు వినిపించాయి. దాంతో అల్లు అరవింద్ దగ్గర కూర్చుని మరీ కొని సీన్స్ ను ట్రిమ్ చేశారట. అలాగే లాజిక్ మిస్ అయిందనిపించిన చోటున ఆ సీన్స్ ను యాడ్ చేశారట. అనవసరం అనుకున్న కొన్ని సీన్స్ ను కూడా లేపేశారని తెలుస్తోంది. కొత్తగా మార్పులు చేసుకుని ‘ఆహా’లోకి అడుగుపెడుతోందన్న ఈ సినిమాను.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement