Friday, July 26, 2024

OTT | ఓటీటీలోకి వచ్చేసిన ‘గాడ్జిల్లా x కాంగ్: ద న్యూ ఎంపైర్..

బ్లాక్ బస్టర్ గాడ్జిల్లా x కాంగ్ మూవీ నేడు సడెన్ గా ఓటీటీకి వచ్చేసింది. రీసెంట్‌గా విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు షేక్‌ చేసిన ఈ మూవీ ఓటీటీకి వచ్చింది. మార్చి 29న ఇండియాలో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ తాజాగా బుక్‌మై షో ఓటీటీలో దర్శనం ఇచ్చింది. అయితే ఈ సినిమాను రెంటల్‌ విధానంలో ఓటీటీకి తీసుకువచ్చింది బుక్‌మై షో. డిజిటల్‌ వేదికపై 4k క్వాలిటీలో ఈ సినిమాను చూడాలంఏట రూ.549 చెల్లించాల్సిందే. పూర్తిగా కొని చూడాలంటే మాత్రం రూ.799 చెల్లించాలని బుక్‌మై షో క్లారిటీ ఇచ్చింది.

ఇక ఈ ఫిక్షనల్‌ మూవీని ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. బుక్‌మై షోతో పాటు అమెజాన్‌, యూట్యూబ్‌లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. సోమవారం నుంచి బుక్‌ మై షోలో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్‌లో రెంట్ విధానంలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement