Sunday, April 28, 2024

ఉచితంగా ఆటో సేవలు..

బెల్లంపల్లి : మున్సిపాలిటీ పరిధిలోని 9, 10, 11, 12వ వార్డుల్లో వృద్దులకు కరోనా వ్యాక్సినేషన్‌ వేయించుకునేందుకు వీలుగా సంరక్ష చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి వరకు ఉచితంగా ఆటో సేవలను అందజేశారు. ఈ సేవల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ హాజరై ఆటో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ సంరక్ష ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వృద్దుల కోసం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాన్ని కొనియాడారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు వృద్దులకు కరోనా వ్యాక్సినేషన్‌ పట్ల అవగాహన కల్పించి అందరు వ్యాక్సినేషన్‌ను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంరక్ష చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ జి.రాయలింగు, సెక్రటరి ఆర్‌.తిరుపతి, ట్రెజరర్‌ సి.వినోద్‌, వైద్యులు రాజేందర్‌, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement