Monday, April 29, 2024

కళాజాత ప్రదర్శన..కరోనాపై అవగాహన

బెల్లంపల్లి : వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామంలో కరోనాపై, సంక్షేమ అభివృద్ధి పథకాలపై కళాజాత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల బృందం సభ్యులు కరోనా వైరస్‌ బారీన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, అసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, అమ్మఒడి, రైతుబందు, రైతుబంధు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారుల బృంధం సభ్యులు మురళి, పోచం, శ్రీనివాస్‌, రమేష్‌, గ్రామపంచాయితీ కారోబార్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement