Tuesday, May 14, 2024

మెగా కజిన్స్ తో ‘వైష్ణవ్ తేజ్’

తన ఫస్ట్ మూవీ ఉప్పెన హిట్ట్ తో మాంచి జోష్ మీదున్నాడు హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే మంచి విజ‌యం అందుకున్న వైష్ణ‌వ్ తేజ్ త‌న సినిమాను మ‌రింత ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. తాజాగా మెగా క‌జిన్స్ నిహారిక‌, వరుణ్ తేజ్‌, సాయి తేజ్‌తో క‌లిసి ర‌చ్చ చేశాడు. వీరి న‌లుగురు చేసిన సంద‌డి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈ వీడియోలో నలుగురు ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు షేర్ చేసుకోగా, అవి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.‘ఉప్పెన’ అనే ప్రేమకథా చిత్రం ద్వారా మగతనం అంటే కొత్త అర్థాన్ని చూపించే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు బుచ్చిబాబు . ప్రేమకు దైవత్వానికి అంగవైకల్యం అడ్డు రాదని పెయిన్ ఫుల్‌గా చూపించాడు. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు, హీరో వైష్ణ‌వ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టికి ఈ సినిమా తొలి సినిమానే అయిన ఎక్క‌డ ఆ ఫీల్ క‌ల‌గ‌కుండా చూపించ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement