Thursday, May 2, 2024

మరోసారి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్నాడు. కాగా మహేశ్ బాబు డ్యాన్స్ చేస్తే చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. కానీ ఆయన చిత్రాల్లో మహేశ్ డ్యాన్స్ చేసింది తక్కువగానే ఉంటాయి. చేసినా కూడా ఉన్న దగ్గరే అక్కడా ఇక్కడా కాలు కదపడం తప్పిస్తే భారీ స్థాయిలో డాన్సులు చేయడం తక్కువే. కానీ సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేశాడు మహేష్ బాబు. ఈ పాటకు శేఖర్ కొరియోగ్రఫీ చేశాడు. ఇప్పుడు సర్కారు వారి పాటలో మరోసారి శేఖర్ కొరియోగ్రఫీలో అదిరిపోయే డాన్స్ నెంబర్ ఉండబోతుంది. దీనికోసం తమన్ కూడా మాంచి బీట్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ పాట రికార్డింగ్ కూడా అయిపోయింది. ఇక షూట్ చేయడమే తరువాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement