Tuesday, May 14, 2024

మనాలీలో నా తొలి కేఫ్..రెస్టారెంట్..

బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. కాగా ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుందీ భామ. తలైవి..ధాకడ్, తేజాస్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో బిజీగా ఉంది కంగనా.అయితే  ఇన్నాళ్ల‌కు కంగ‌నార‌నౌత్ క‌ల నెర‌వేరింది. ఇంత‌కీ ఈ భామ‌కున్న ఆ డ్రీమ్ ఏంటో తెలుసా.. వ‌్యాపార రంగంలోకి రావ‌డం. త‌న స్వ‌స్థ‌లం మ‌నాలీలో ఫుడ్ అండ్ బేవ‌రేజెస్ బిజినెస్ మొద‌లుపెట్టే ప‌నుల‌ను షురూ చేసింది కంగనా.ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంటూ..కేఫ్, రెస్టారెంట్ ఓపెన్ చేసే ప్రాంతంలో సోద‌రి రంగోలి చందేల్ అండ్ టీంతో చ‌ర్చిస్తున్న ఫొటోల‌ను ట్విట‌ర్ లో షేర్ చేసుకుంది. నా డ్రీమ్ వెంచ‌ర్ ను మీ అంద‌రితో షేర్ చేసుకుంటున్నా. సినిమాల త‌ర్వాత నాకు ఇష్ట‌మైంది ఫుడ్ అండ్ బేవ‌రేజెస్ ను ఏర్పాటు చేయ‌డం. మ‌నాలీలో నా తొలి కేఫ్‌, రెస్టారెంట్ ను రెడీ చేస్తున్నా. అద్బుతంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్న నా టీంకు ధ‌న్య‌వాదాలు అని ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement