Thursday, May 16, 2024

Samsung | మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్‌ఫోన్లు..

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎ55 5G, గెలాక్సీ ఎ35 5Gలను విడుదల చేసింది. గెలాక్సీ ఎ35 ధర రూ.27,999 కాగా, గెలాక్సీ ఎ55 ధర రూ.36,999 గా నిర్ణ‌యించారు. ఈ ఫోన్‌లను ఈ నెలలో భార‌త్ మార్కెట్ లో లాంచ్ చేయగా, Samsung.com & ఇతర ఆఫ్​ల​ఐన్ స్టోర్‌లలో సేల్‌కి అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ రోజు నించి (మార్చి 18) ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఈ కొత్త A సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్, AI-కెమెరా ఫీచర్లను కలిగి ఉన్నాయి. అనేక ఇతర కొత్త ఫీచర్లతో పాటు ట్యాంపర్-రెసిస్టెంట్ సెక్యూరిటీ సొల్యూషన్, Samsung నాక్స్ వాల్ట్‌తో సహా పలు ప్రతిష్టాత్మక ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement