Saturday, April 27, 2024

అసెంబ్లీని కౌరవ సభ చేసి.. భువనేశ్వరిని అవ‌మానిస్తారా?: బాబూ రాజేంద్ర ప్రసాద్

కృష్ణా జిల్లా ఉయ్యూరులో టీడీపీ ఆందోళ‌న నిర్వ‌హించింది. తెలుగుదేశం నాయ‌కుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వ‌ర్యంలో పార్టీ నేతలు, కార్య‌క‌ర్త‌లు కార్య‌క్ర‌మంలో పాల్గొని సీఎం జ‌గన్, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వంశీ, రోజా పోస్టర్లను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. అసెంబ్లీ లో భువనేశ్వరికి జరిగిన అవమానానికి, చంద్రబాబు కన్నీటికి బదులు తీర్చుకుంటామ‌న్నారు. అన్ననందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరిని అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన వైసీపీ నాయకులకు పుట్టగతులు ఉండవన్నారు.

కార్యక్రమం లో ఉయ్యూరు పట్టణ, మండల అధ్యక్షుడు గుర్నాధరావు, కుటుంబరావు, పిచ్చిరెడ్డి , మచిలీపట్నం పార్లమెంట్ యువత అధ్యక్షుడు చౌదరి, జబర్ల పూడి సర్పంచ్ ప్రసాద్, సాయిపురం సర్పంచ్ బాషా, కౌన్సిలర్స్ పండ్రాజు సుధారాణి, పలియాల శ్రీను, ఉయ్యూరు మండల గ్రామాల, పట్టణ పార్టీ అధ్యకులు, కార్యదర్శులు,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement