Friday, April 19, 2024

Telangana: జిల్లా కోర్టులతో కేసుల సత్వర పరిష్కారం .. హైకోర్టు జడ్జి షమీం అక్తర్

జిల్లా కోర్టులో ఏర్పాటుతో కేసుల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని పోర్టుఫోలియో జడ్జి షమీం అక్థర్ ర్ పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు తో పాటు ఫోక్సో కోర్టు ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇకపై కేసుల విచారణ కోసం కరీంనగర్ వెళ్లాల్సిన అవసరం లేదని, పెద్దపల్లి లోనే విచారణ జరగడంతో కేసుల పరిష్కారం త్వరగా సాధ్యమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వరూధిని, జూనియర్ సివిల్ జడ్జి రాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి రమణారెడ్డి, కార్యదర్శి భాస్కర్, డిసిపి రవీందర్, ఎసిపీ సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్, ఇంద్రసేనారెడ్డి తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement