Sunday, May 19, 2024

విశాఖ స్టీట్ ప్లాంట్ కార్మికుల సమ్మె నోటీస్…

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేస్తున్న ఆ సంస్థ కార్మికులు మ‌రో ముంద‌డుగు వేశారు.. ప్రైవేటీక‌ర‌ణ నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోక‌పోతే స‌మ్మెకు దిగాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.. ఈ మేర‌కు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. పది రోజులు ముందుగా సమ్మె నోటీసు ఇవ్వాలని నిబంధన మేరకు కార్మికులు ఈ రోజు సమ్మె నోటీసు ఇచ్చారు. యాజమాన్యం నుంచి సరైన స్పందన రాకపోతే 20వ తేదీ తర్వాత కార్మికులు నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement