Monday, May 13, 2024

రాధేశ్యామ్ నుంచి మరో పోస్టర్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇందులో మొదట రాధే శ్యామ్ జూలై 30న ప్రజల ముందుకు రానుంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా మహాశివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో ప్రభాస్, పూజా హెగ్డే ఆకాశం వైపు చూస్తూ కనిపించారు. ఈ సినిమా కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిందీలో భరద్వాజ్ ద్వయం, మిధున్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement