Wednesday, May 22, 2024

సింహాచలం క్షేత్రంలో గిరిప్రదక్షిణ మహోత్సవం ప్రారంభం

విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరిప్రదక్షిణ మహోత్సవం ఆదివారం వైభవోపేతంగా ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు తరలివచ్చారు.. మధ్యాహ్నం 2.30గంటలకు తొలి పావంచా వద్ద విశాఖ నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. అశేష భక్తజనం రథాన్ని అనుసరించారు.

అడవివరం, హనుమంతవాకా, అప్పుఘర్‌ మార్గంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, జీవీఎంసీ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు అల్పాహారం, మజ్జిగ అందిస్తున్నాయి. కోనసీమ, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement