Friday, May 17, 2024

గోదావరిలో కొట్టుకుపోయిన భక్తులు..కాపాడిన గంగపుత్రులు

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం లోని త్రివేణి సంగమ గోదావరి నదిలో దిగిన నలుగురు భక్తులు కొట్టుకుపోగా గంగాపుత్రులు కాపాడారు. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ కు చెందిన నలుగురు భక్తులు ఇవ్వాల (ఆదివారం) కాళేశ్వరం దర్శనానికి వచ్చారు. ముందుగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వెళ్లారు. స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరగటంతో ప్రమాదవ శాత్తు నీటిలో మునిగి ప్రవాహానికి కొట్టుకుపోయారు.

గమనించిన కాళేశ్వరం గ్రామానికి చెందిన పానేం రాజు, గోర శ్రీకాంత్, గోర దేవయ్య, ఊట్ల రమేష్ అనే గంగపుత్రులు వెంటనే నీటిలోకి దూకి వారిని రక్షించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో భక్తులు, బాధితుల బందువులు ఊపిరి పీల్చుకున్నారు. గంగపుత్రులను స్థానికులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement