Friday, April 26, 2024

ఈతకెళ్లి.. ఇద్దరు ఆర్మీ ఉద్యోగుల గల్లంతు..

ఈతకెళ్లి ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు గల్లంతైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలోని చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు నీటమునిగి గల్లంతయ్యారు. దీంతో రెండు ఆర్మీ కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. పూసలపాడు గ్రామానికి చెందిన కర్నాటి రామచంద్రారెడ్డి మృతదేహం లభ్యం కాగా మరో వ్యక్తి శివకోటిరెడ్డి కోసం చెక్‌డ్యాంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement