నెల్లూరు: ఎపిలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు వైసిపి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… నెల్లూరు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టిడిపి అధినేత కుమారుడు నారా లోకేష్ అవహగాన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు ఇంకా రాజకీయ పరిణితి రాలేదన్నారు. బీజేపీ జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయికి దిగజారిపోయిందన్నారు. ఇక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయతకు జనం జేజేలు కొడుతున్నారని, తిరుపతి ఉప ఎన్నికలో గురుమూర్తి విజయం ఖాయమని అన్నారు. శంఖారావం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ప్రజాదరణతో వైయస్ఆర్ సీపీకి అద్వితీయమైన బలం వచ్చిందన్నారు. ఉప ఎన్నికలో వైయస్ఆర్ సీపీ అభ్యర్థి గురుమూర్తికి భారీ మెజార్టీ వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement