Friday, April 26, 2024

ఆంధ్రలో కొడుకు..తెలంగాణలో కూతురు: వీహెచ్

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏమైనా చేయాలనుకుంటే ఆంధ్రాలో చేసుకోవాలని సూచించారు. విజయమ్మ ఆంధ్రలో కొడుకు, తెలంగాణలో కూతురు ఉండాలని అనుకుంటున్నారా?అని వీహెచ్ ప్రశ్నించారు. వైఎస్ షర్మిల.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె మాత్రమేనని అంతకుమించి ఏమీలేదన్నారు. కరోనాతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతుంటే షర్మిల సభకు ఎలా అనుమతిస్తారు? అని వీహెచ్ ప్రశ్నించారు. రోడ్ల మీద రోడ్ షోలకు ఎందుకు అనుమతిచ్చారని నిలదీశారు. తాము ఎక్కడికి వెళ్లినా అనుమతివ్వరని తెలిపారు. వాళ్లకోక న్యాయం.. తమకొక న్యాయమా? అంటూ వీహెచ్ ఫైర్ అయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణలో ఉండే ఆంధ్రా ఓట్లను కొల్లగొట్టడానికి ఆడిస్తున్న నాటకమే ఇదంతా అని వీహెచ్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement