Saturday, April 27, 2024

40 ఏళ్ల నుంచి చంద్ర‌బాబుతో పోరాడుతూనే ఉన్నా – మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి: రాజ‌కీయంగా త‌న‌ను ఏమీ చేయ‌లేక అక్ర‌మ కేసుతో త‌న కుమారుడు మిధున్ రెడ్డిని 15 రోజుల పాటు జైలులో ఉంచిన ఘ‌న చరిత్ర క‌లిగిన నేత చంద్ర‌బాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, చంద్ర‌బాబుతో తాను విద్యార్ధి ద‌శ నుంచే పోరాటం చేస్తున్నాన‌ని చెప్పారు.. బాబు లాంటి నీతిమాలిన నాయకుడు ఈ దేశంలోనే ఎవరూ ఉండరని పేర్కొన్నారు.. తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్ర‌బాబు వైసిపి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నార‌ని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను కూడా నియమించుకోలేని దుస్థితిలో ఉన్న చంద్రబాబు.. రౌడీ రాజ్యం అని మాట్లాడటం దురదృష్టకరమన్నారు. 5 కోట్ల ప్రజలంతా రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిందని సంతోషంగా ఉన్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement