Wednesday, May 8, 2024

జగన్ సీఎం అయ్యాక అంతా గందరగోళం: నాదెండ్ల మనోహర్

వైఎస్ జగన్ ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శంచారు నాదెండ్ల మనోహర్. ఇక ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై జగన్ ఇప్పటికైనా తన వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హక్కుగా రావాల్సిన నీటి విషయంలో జగన్ ఎందుకు పోరాడలేకపోతున్నారని ప్రశ్నించారు. జగన్ సొంత కుటుంబంలోని వ్యక్తి తెలంగాణలో పార్టీ పెట్టి రకరకాలుగా మాట్లాడుతుంటే, ఇక్కడి మంత్రులు మరో రకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తమ వలంటీర్ల ద్వారా పార్టీలుగా విభజించారని ధ్వజమెత్తారు. జనసేన కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు.

ఇక తమ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో త్వరలోనే నీటి పారుదల నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మనోహర్ తెలిపారు. తెనాలి మండలం ఎరుకలపూడిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జనసేన నాయకుడు పసుపులేటి శివదుర్గాప్రసాద్ కుటుంబాన్ని నిన్న పరామర్శించిన నాదెండ్ల మనోహర్ ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును అందించారు.

ఇది కూడా చదవండి:అమ్ముడవని అరటిపళ్లతో డ్రై ఫ్రూట్స్..

Advertisement

తాజా వార్తలు

Advertisement