Monday, May 6, 2024

ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలి… కలెక్టర్ డా. సుజనా

కర్నూల్ ప్రతినిధి : ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.సుజనా తెలిపారు. శనివారం ఉదయం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల యంత్రాంగంతో సమీక్షించారు. కర్నూలు జిల్లాలో ఇంటింటికి ఓటర్ల సర్వే కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన కర్నూల్ రెవెన్యూ డివిజన్ లోని వెల్దుర్తి మండల కేంద్రంలో బీఎల్ఓ పై సస్పెన్షన్ వేటు పడింది.

వాలంటరీతో కలిసి బీఎల్ఓ ఇంటింటా సర్వేలో పాల్గొన్నారు. దీంతో కలెక్టర్ డాక్టర్ సుజనా సస్పెన్షన్ కు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయని సూచించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వాలంటరీతో కలిసి సర్వే చేస్తే సస్పెన్షన్స్ ఉంటాయని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement