Tuesday, May 14, 2024

Kamareddy: విషాదం.. పాముకాటుకు తండ్రి కొడుకులు మృతి

జులై 22, రాజంపేట, ప్రభా న్యూస్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో పాముకాటుకు గురై తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని మూడు మామిళ్ల బీబీ తండాకు చెందిన ముద్రిచ్చా రవి (40), వినోద్(12) తండ్రీ కొడుకులు శుక్రవారం అర్ధరాత్రి పాముకాటు గురై చనిపోయారు. రాత్రిపూట నిద్రలో 11:30 ప్రాంతంలో అకాల వర్షాల వల్ల ఇళ్లలోకి వచ్చే విష పురుగులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు పలు జాగ్రత్తలు వహిస్తారని భావిస్తూ… మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోగలరు. ముఖ్యంగా పురాతన ఇళ్లల్లో ముఖ్యంగా శ్రద్ధ వహించి విష పురుగుల నుండి ప్రాణాలను కాపాడుకుందాం. అత్యవసర సమయాల్లో పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించే ప్రయత్నం చేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement