Sunday, May 19, 2024

AP: శ్రీశైలంలో ఎలుగుబంటి… భయాందోళన‌లో భక్తులు

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవాలయానికి సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. శిఖరేశ్వరం చెక్ పోస్టు వద్ద రోడ్డుపై ఎలుగుబంటి భక్తులకు కనిపించింది. వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. ఎలుగుబంటి సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఎలుగుబంటి సంచరించిన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement