Saturday, April 27, 2024

విద్యుత్ స్తంభాన్ని ఢీకొని స్కార్పియో ద‌గ్ధం..

అవుకు మండలంలోని సింగనపల్లి గ్రామ సమీపంలో మంగళవారం స్కార్పియో వాహనం దగ్ధ‌మైంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో ఒక్క‌సారిగా స్కార్పియో వాహనంలో మంట‌లు చెల‌రేగాయి. కొద్దిసేప‌ట్లోనే పూర్తిగా కాలిపోయింది. అవుకు నుండి సంగాపట్నం వ‌స్తుండ‌గా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ మల్లిఖార్జున, మౌలాలిలకు గాయాల‌య్యాయి. బాధితుల‌ను అంబులెన్స్ లో బనగానపల్లె ఆసుపత్రికి తరలించారు. స‌మాచారం అందుకున్న అగ్ని మాప‌క సిబ్బంది ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement