Saturday, April 27, 2024

వీళ్లూ కొడుకులేనా…..

క‌ర్నూలు/ వికారాబాద్: నాగ‌రిక ప్ర‌పంచంలో మాన‌వ విలువ‌లు, సంబంధాలు నానాటికి దిగుజారుతున్నాయి. క‌నిపెంచిన వారి ప‌ట్ల కొంద‌రు క‌ర్క‌షంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. అవ‌సాన ద‌శలో అండ‌గా ఉంటార‌నుకుంటే భారంగా భావించి వ‌దిలించుకుంటున్నారు. వికారాబాద్ జిల్లాలో కన్నతల్లిదండ్రుల పట్ల కొడుకులు కర్కశత్వం ప్ర‌ద‌ర్శించారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండ‌లం ప‌స్లాబాద్ గ్రామానికి చెందిన జీవి నారాయణ, సాంసన్ రాజు తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకువస్తామని వెళ్లి జాడలేకుండా పోయారు. చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు విడిచారు. విషయాన్ని ద‌వాఖాన సిబ్బంది వారికి ఫోన్ చేసి చెప్పినా స్పందించ‌లేదు. ఎదురు చూసినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ద‌వాఖాన‌ సిబ్బందే అంత్యక్రియలు నిర్వ‌హించారు. ఈ సమాచారాన్ని హాస్ప‌ట‌ల్ సిబ్బంది పోలీసుల‌కు అందించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement