Thursday, May 16, 2024

kurnool : నేరేడు పండ్లు తిన్న ఘటనలో.. మరో బాలుడు మృతి

నాలుగురోజుల క్రితం నేరేడు పండ్లు తిన్న ఘటనలో న‌లుగురు చిన్నారులు అస్వస్థతకు గురైన వారిలో ఈరోజు మ‌రో బాలుడు చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా కోసిగిలో చోటుచేసుకుంది. పురుగుల మందుల కవర్‌లో నేరేడు పండ్లు తీసుకెళ్లి తినడంతో నలుగురు అస్వస్థతకు లోనయ్యారు.

హర్ష అనే రెండేళ్ల బాలుడు అదేరోజు చనిపోగా.. మిగతా ముగ్గురిని అదోనిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈరోజు అంజి అనే మరో బాలుడు చికిత్సపొందుతూ మృతిచెందాడు. మరో ఇద్దరు మహాదేవి, శ్రీరాములు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement