Sunday, April 28, 2024

కోడూరులో నాటు సారా స్వాధీనం.. నిందితుల‌కు రిమాండ్‌

తిరువూరు: కృష్ణా జిల్లా ఏ కొండూరు మండ‌లం కోడూరులో నాటు సారా అమ్ముతున్న వ్య‌క్తికి తిరువూరు మెజిస్ర్టేట్ రిమాండ్ విధించారు. త‌మకు అందిన స‌మాచారం మేర‌కు తిరువూరు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో స్టేషన్ సీఐ బి. గురవయ్య ఆధ్వర్యంలో ఏ. కొండూరు మండలం కోడూరు గ్రామం లో సోదాలు నిర్వ‌హించారు. గ్రామంలో సారా అమ్ముచున్న కంభంపాటి యేసు నుండి 7 లీటర్ల సారా ను, మల్లాది రఘనందరావు నుండి 2 లీటర్ల సారా ను స్వాధీను చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి తిరువూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజ‌రు ప‌రిచారు. విచార‌ణ‌ల అనంత‌రం నిందుతుల‌కు 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ చేయాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశించారు. ఈ మేర‌కు పోలీసులు వారిని నూజివీడు సబ్ జైలు కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement