Saturday, April 27, 2024

పంటపొలాల్లోకి ఏనుగుల గుంపులు.. ఆవేదనలో రైతన్నలు..

గుడుపల్లి, ఏప్రిల్ 6 (ప్రభ న్యూస్ ) : కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం ఓఎన్ కొత్తూరు పంచాయతీ శ్రీనివాస పురం ఏనుగుల గుంపులు హ‌ల్ చ‌ల్ చేశాయి. కొత్తూరులోని పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేయ‌డంతో చేతి కొచ్చే టమోటా దిగుబడి నాశనం అయ్యింది. దీంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కథ‌నం మేరకు గురువారం ఏనుగుల గుంపు ఉన్నట్టుండి అడవి నుండి శ్రీనివాసపురం గ్రామ సమీప పంట పొలాల వైపు రావడం జరిగింది. ఆ గుంపు పంట పొలంను తొక్కుతూ నానా బీభత్సం సృష్టించాయి. దీంతో త‌మ పంట‌లు దాదాపు ధ్వంసం అయ్యాయ‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప్పు చేసి కష్టపడి పండించిన పంటను ఏనుగులు ఇలా నాశ‌నం చేయడంతో నష్టపోయామని, ప్రభుత్వం తమను గుర్తించి ఆదుకోవాలని రైతులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement