Friday, May 3, 2024

సోదరుడిపై కోపం.. ఫోన్ మింగిన అక్క..

ప్రస్తతమున్న పరిస్థితుల్లో ఎవరికీ ఎవరం తగ్గం అనే రీతిలో ఉంటున్నారు. పసి పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ క్షణికావేశంలో ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏం చేస్తున్నామో తెలుసుకునే లోపే జరగాల్సింది జరిగిపోతుంది. అయితే ఇప్పటి వరకు నాణేలు, పిన్నులు మొదలైనవి తినడం లేదా మింగడం లాంటి కేసులు విని ఉంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఓ 18ఏళ్ల యువతి తమ్ముడిపై కోపంతో ఏకంగా ఫోన్ మొత్తాన్ని మింగేసింది. అక్క, తమ్ముడి మధ్య జరిగిన చిన్నపాటి గొడవతో ఆ యువతి ఫోన్ మింగేసింది.

ఈ విషయం తెలుసుకున్న యువత బంధువులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గ్వాలియర్‌కు రెఫర్ చేశారు. గ్వాలియర్‌కు వచ్చిన తర్వాత జిల్లా ఆస్పత్రిలోని వైద్యుల బృందం విజయవంతంగా ఆపరేషన్ చేసి బాలిక కడుపులో ఉన్న మొబైల్‌ను బయటకు తీశారు. ఈ ఘటనపై గ్వాలియర్‌లోని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్‌కె ధాకడ్ మాట్లాడుతూ… యువతికి అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు నిర్వహించామని.. ఆమె కడుపులో మొబైల్ ఫోన్ ఉందని తేలిందన్నారు. తర్వాత సర్జరీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ ప్రశాంత్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆపరేషన్ చేసి యువతి కడుపులో ఉన్న మొబైల్ ఫోన్‌ను విజయవంతంగా బయటకు తీశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement