Saturday, April 27, 2024

శోభాయాత్రతో ఆధ్యాత్మిక వైభవం : ఎమ్మెల్యే గణేష్ బిగాల

నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ (ప్రభ న్యూస్) : హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రతో.. ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుందని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. గురువారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కంటేశ్వర్ వద్ద హనుమాన్ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. వీర హనుమాన్ విజయయాత్ర ఆధ్యాత్మికంగా శాంతియుతంగా నిర్వహించేందుకు మున్సిపల్, పోలీస్, ఆరోగ్య శాఖ, ఎలాక్ట్రిసిటీ అధికారులని సమన్వయం చేస్తూ ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు కల్పించారని పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొనే భక్తులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మంచినీరు, పండ్లు, అల్పాహారం ఏర్పాటు చేశామని తెలిపారు. శోభాయాత్రలో పాల్గొన్న 5000 హనుమాన్ భక్తులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అర్బన్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం మంచి నీరు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయ ర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరే టర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement