Thursday, May 2, 2024

AP : రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలి… ష‌ర్మిల

రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలని ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ ష‌ర్మిల ప్ర‌శ్నించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక జగన్‌ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? రాజధాని కట్టగలిగారా అని ప్ర‌శ్నాల వర్షం కురిపించారు.

- Advertisement -

చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని నిలదీశారు. రైతులకు అన్యాయం జరగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు? మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ ఇచ్చారు. ఎన్నికలకు 2 నెలల సమయం ఉందన్నప్పుడే గుర్తొచ్చిందా? కుంభకర్ణుడు ఆరు నెలలే నిద్రపోతాడు. మీరు ఐదేళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచారా? సిద్ధమంటూ బయల్దేరారు.. దేనికి అప్పులు చేయడానికా? మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నారు. ఇప్పుడు సర్కారే లిక్కర్ అమ్ముతోంది. నాసిరకం మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు” అని షర్మిల మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement