Friday, May 3, 2024

AP: టీడీపీ ప్రచార వాహనానికి నిప్పు…

తెలుగుదేశం పార్టీ ప్ర‌చార వాహ‌నానికి దుండగులు నిప్పుపెట్టిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపి ప్రచార వాహనంపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. వాహనంలో డ్రైవర్‌ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ఇవాళ‌ ఉదయం నంబర్‌ ప్లేట్‌ లేని బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ప్రచార రథంపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. స్థానిక సీఐ పులిశేఖర్ టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పి నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాదాపు 2 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement